పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అవుతోంది.కాగా బాలీవుడ్లో సూపర్ సక్సెస్ అయిన పింక్ చిత్రాన్ని తెలుగులో ‘వకీల్ సాబ్’గా రీమేక్ చేస్తున్నారు.
ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈ సినిమాతో మరోసారి పవన్ కళ్యాణ్ అదిరిపోయే సక్సెస్ను అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
అయితే తొలుత వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా వైరస్ కారణంగా అది సాధ్యం కాలేదు.ఈ సినిమా షూటింగ్ను వాయిదా వేయడంతో ఈ సినిమాను ఇప్పట్లో రిలీజ్ చేసే అవకాశాలు కూడా కనిపించడం లేదు.అయితే ఈ సినిమాను ఈ ఏడాదిలో రిలీజ్ చేయడం కుదరకపోవడంతో వచ్చే సంక్రాంతి బరిలో దించాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ ఇప్పుడు అది కూడా కుదిరేలా లేదని తెలుస్తోంది.
ఈ ఏడాదిలో సినిమా షూటింగ్లు దాదాపు మొదలుపెట్టే ఆలోచనలో టాప్ హీరోలు లేరని తెలుస్తోంది.
దీంతో వకీల్ సాబ్ చిత్రాన్ని వచ్చే వేసవి బరిలో రిలీజ్ చేయడమే ఉత్తమమని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ మేరకు వేసవిలో రిలీజ్ చేసే దిశగా వారు అడుగులు వేస్తున్నారు.
లాయర్ పాత్రలో పవన్ నటిస్తోండగా, నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.