పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు పవర్ స్టార్ రెడీ అవుతున్నాడు.
బాలీవుడ్లో తెరకెక్కిన ‘పింక్’ చిత్రానికి రీమేక్గా వస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో పవన్ ఓ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.దీంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.తొలుత వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.
ఇక సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభం కాగా వకీల్ సాబ్ చివరి దశ షూటింగ్ మిగిలి ఉందని చిత్ర యూనిట్ తెలిపింది.దీంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కాగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ను వచ్చే వేసవికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.అంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలానే మిగిలి ఉందనే వార్త సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఎప్పుడో చివరిదశలో ఉన్న సినిమా షూటింగ్, ఇంకా మిగిలి ఉండటమేమిటి అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.అంటే చిత్ర యూనిట్ చెప్పిన దానికంటే ఈ సినిమా షూటింగ్ అధిక భాగంలో బ్యాలెన్స్ ఉందని, అందుకే ఈ సినిమా షూటింగ్ ఎంతకీ పూర్తవడం లేదని చిత్ర వర్గాలు అంటున్నాయి.
పవన్ కళ్యాణ్ సరసన ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తోండగా, నివేదా థామస్, అంజలిలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మరి వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందో చూడాలి అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.