తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా వ్యవహరించిన వక్కంతం వంశీ దర్శకుడిగా మారాడు.మొదటి సినిమా నా పేరు సూర్య చిత్రంతో చాలా నిరుత్సాహ పర్చారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది రచయితలు దర్శకులుగా మారారు.అయితే ఎక్కువ శాతం మంది సక్సెస్లు దక్కించుకున్నారు.
కనుక ఈయన కూడా సక్సెస్ అవుతాడని అనుకున్నారు.కాని నాపేరు సూర్య చిత్రం ఫ్లాప్ అయ్యింది.
కిక్, రేసుగుర్రంలతో పాటు పలు హిట్ చిత్రాలకు కథ అందించడంతో పాటు స్క్రీన్ప్లేను విభిన్నంగా ప్రజెంట్ చేస్తాడు అనే నమ్మకంతో అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం ఛాన్స్ ఇచ్చాడు.తీరా చూస్తే ఆ సినిమా ఆకట్టుకోలేక పోయింది.
దాంతో వక్కంతం వంశీకి రెండవ ఆఫర్ ఇప్పట్లో వచ్చేట్లు లేదు.దర్శకత్వం చేసే అవకాశం ఇప్పట్లో వస్తుందనే నమ్మకం లేకపోవడంతో దర్శకుడు వంశీ మళ్లీ రచయితగా మారాడు.
ఈమద్య తాను రాసుకున్న కథలతో హీరోల వద్దకు వెళ్తున్నాడట.
పరిచయం ఉన్న హీరోల వద్దకు స్టార్ హీరోల వద్దకు కూడా వంశీ వెళ్లాడట.కథ బాగుందన్న హీరోలు ఆయన దర్శకత్వంలో చేసేందుకు మాత్రం కాస్త భయపడుతున్నారట.రచయితగా మళ్లీ రెండు మూడు హిట్స్ పడితే తప్పకుండా వంశీకి ఛాన్స్లు వస్తాయి.
అందుకే ఈ సమయంలో ఆయన దర్శకత్వం పై కంటే ఎక్కువగా రచనలపై ఫోకస్ పెడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.