కరోనా కారణంగా దాదాపు పది నెలల పాటు సినిమా ఇండస్ట్రీ స్థంభించింది.షూటింగ్ లు కాస్త జరిగినా కూడా సినిమాల విడుదల మాత్రం నిలిచి పోయింది.
సినిమా థియేటర్లలో జనాలు లేక వెలవెల పోయాయి.పూర్తిగా ఆరు నెలలకు పైగా మూత పడ్డ థియేటర్లు జనవరి నుండి ఓపెన్ అయ్యాయి.
ఈమద్యే పూర్తి స్థాయిలో నడస్తున్నాయి.ఇలాంటి సమయంలో జనాలు సినిమాలకు వస్తారా అనుకుంటూ ఉండగా అనూహ్యంగా ఉప్పెన సినిమా వంద కోట్ల ను రాబట్టింది.
లాక్ డౌన్ తర్వాత వంద కోట్లు సాధించిన సినిమా గా ఉప్పెన చరిత్రలో నిలిచి పోతుంది అనడంలో సందేహం లేదు.అందుకే ఉప్పెన సక్సెస్ ను చిత్ర యూనిట్ సభ్యులు సినీ ప్రముఖులతో సెలబ్రేట్ చేసుకున్నారు.
అద్బుతమైన ఒక వేదికను ఎంపిక చేసి అక్కడకు సినీ ప్రముఖులను ఆహ్వానించి ఉప్పెన సక్సెస్ వేడుకను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మెగా స్టార్ చిరంజీవి తో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ లు కూడా హాజరు అయ్యారు.
ఇంకా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తున్న నటీ నటులు మరియు ఆ బ్యానర్ లో సినిమాలు చేస్తున్న దర్శకులు ఇతర టెక్నీషియన్స్ అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.దర్శకులు మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్న ఈ వేడుక వావ్ అన్నట్లుగా సాగింది.
తెలుగు సినిమా పరిశ్రమలో ఈమద్య కాలంలో ఇలాంటి పార్టీ జరగలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.సినిమాలు సక్సెస్ అయితే ఇలా నిర్మాతలు పార్టీలు ఇవ్వడం కామన్ కాని ఈసారి అంతకు మించి అన్నట్లుగా చాలా గ్యాప్ తర్వాత జరిగిన పార్టీ అవ్వడంతో అందరు కూడా ఈ పార్టీ గురించి చర్చిస్తున్నారు.