ప్రస్తుతం టాలీవుడ్ లోకి మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇందులో భాగంగా ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ నటిస్తున్న చిత్రం విడుదల తేదీ ఖరారైంది.
ఎప్పటినుంచో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎట్టకేలకు పూర్తి చేసుకొని ఈ నెల ఏప్రిల్ 2వ తారీఖున విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.అయితే ఈ చిత్రానికి నూతన దర్శకుడు బుచ్చిబాబు సాధన దర్శకత్వం వహించగా వైష్ణవ తేజ్ సరసన తమిళ బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది.
అలాగే విలన్ పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.
అయితే ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ఫస్ట్ లుక్ కూడా విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది.
దీంతో మెగా వారసు ల్లో ఒకరైన టువంటి వైష్ణవ తేజ్ ఈ చిత్రంపై భారీగానే అంచనాలు మొదలవుతున్నాయి.అయితే చివరకు ఈ చిత్ర ట్రైలర్ టీజర్ వంటి విడుదల కాకపోవడంతో మెగా అభిమానులు వైష్ణవ తేజ్ ఈ చిత్రం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా సుకుమార్ రేటింగ్స్ సంస్థ కథ ను అందిస్తోంది.అంతేగాక ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.