ఉప్పెన సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో వరుస ప్రాజెక్ట్ లని వైష్ణవ్ తేజ్ లైన్ లో పెట్టాడు.
ఉప్పెన రిలీజ్ కాకుండానే క్రిష్ దర్శకత్వంలో కొండపొలం సినిమా పూర్తి చేశాడు.ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువగా ఉండటంతో రిలీజ్ ఆలస్యం అవుతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఉప్పెన రిలీజ్ తర్వాత వెంటనే అన్నపూర్ణ బ్యానర్ లో ఒక సినిమాకి వైష్ణవ్ తేజ్ కమిట్ అయ్యాడు.అలాగే అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ దర్శకుడు గిరీశయ్య దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.
అలాగే మైత్రీ మూవీస్ బ్యానర్ లోనే మరో మూవీ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మితమవుతున్న సినిమాతో పృధ్వీ అనే యంగ్ టాలెంటెడ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
ఇక ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని పీరియాడిక్ టచ్ కథతో ఈ సినిమాని స్క్రిప్ట్ ని దర్శకుడు సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఇండియన్ హాకీ స్వర్ణయుగంలో ఓ ఫేమస్ హాకీ ప్లేయర్ పాత్రలో వైష్ణవ్ తేజ్ కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు.
ఈ పాత్ర కోసం వైష్ణవ్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.