అక్కినేని అఖిల్ తో ఏజెంట్ సినిమా చేస్తున్న సురేందర్ రెడ్డి తన నెక్స్ట్ సినిమా మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో చేస్తున్నాడని తెలుస్తుంది.ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ క్రిష్ డైరక్షన్ లో సినిమా పూర్తి చేశాడు.
ప్రస్తుతం గిరీశయ్య డైరక్షన్ లో ఓ సినిమా సెట్స్ మీద ఉంది.తమిళ అర్జున్ రెడ్డి డైరెక్ట్ చేసిన గిరీశయ్య వైష్ణవ్ తేజ్ తో మరో రొమాంటిక్ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున నిర్మాతగా వైష్ణవ్ తేజ్ సినిమా వస్తుంది.
ఈ సినిమాకు దర్శకుడిగా సురేందర్ రెడ్డిని ఫిక్స్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్.
సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసినా కథ మాత్రం డైరక్టర్ దశరథ్ అందిస్తున్నారని తెలుస్తుంది.డైరక్టర్ గానే కాదు రైట గా దశరథ్ ఎన్నో సినిమాలకు కథలు అందించారు.
ఇక ఇప్పుడు రైటర్ గా మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు.వైష్ణవ్ తేజ్ తో సురేందర్ రెడ్డి చేస్తున్న సినిమాకు దశరథ్ కథ అందిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.