టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది.కానీ కరోనా ప్రభావంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.
దీంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రానుండటంతో వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని కూడా లైన్లో పెట్టాడు ఈ యంగ్ హీరో.
ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో తన రెండో చిత్రాన్ని తెరకెక్కి్స్తున్న వైష్ణవ్ తేజ్, ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు.
కాగా ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.అడవి బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ సినిమా షూటింగ్ను వికారాబాద్ అడవుల్లో చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలోనే వైష్ణవ్ తేజ్ తన మూడో చిత్రాన్ని కూడా ఓకే చేసేందుకు రెడీ అయ్యాడు.ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో తన మూడో చిత్రాన్ని తెరకెక్కించేందుకు వైష్ణవ్ తేజ్ సిద్ధమయ్యాడు.
అయితే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.ఏదేమైనా ఈ హీరో నటించిన తొలి సినిమా కూడా రిలీజ్ కాకముందే అప్పుడే మూడో సినిమాను లైన్లో పెడుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఈ హీరో సినిమాల కోసం ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ హీరో నటించబోతున్న మూడో సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు, ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారు, అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.వైష్ణవ్ తేజ్ ఇలా వరుసగా సినిమాలను ఓకే చేస్తుండటంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.