రెండవ సినిమాతోనే మెగా హీరో అంతటి సాహసం చేశాడా?

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావాల్సి ఉంది.కాని ఇప్పటి వరకు కరోనా కారణంగా ఉప్పెన సినిమా విడుదల అవ్వలేదు.

 Vaishnav Tej Second Film Kondapolam Releasing In Ott, Vaishnav Tej ,ott Release,-TeluguStop.com

సంక్రాంతి సినిమా తర్వాత ఉప్పెనను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఉప్పెనకు ఓటీటీ ఆఫర్‌ వచ్చింది.

కాని మొదటి సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యం తో వైష్ణవ్‌ తేజ్‌ రిక్వెస్ట్‌ మేరకు ఓటీటీ విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని నిర్మాతలు తీసుకోలేదు.నష్టం వచ్చినా కూడా పర్వాలేదు వచ్చే సంక్రాంతి తర్వాత థియేటర్లలో ఉప్పెన సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్‌ వచ్చారు.

ఉప్పెన వచ్చిన వెంటనే వైష్ణవ్‌ తేజ్‌ ‘కొండ పొలం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

క్రిష్‌ దర్శకత్వంలో కొండ పొలం రూపొందుతోంది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌ గా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఒక ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

ఇదో కమర్షియల్‌ మూవీ కాదు.ఇందులో తెలుగు ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ తక్కువగా ఉంటాయి.

ఇలాంటి సినిమాను చేసేందుకు దర్శకుడికి ఘట్స్‌ ఉండాలి.ఇలాంటి సినిమాలో నటించేందుకు హీరోకు ధైర్యం ఉండాలి.

ఇలాంటి సినిమాను చేస్తున్నందుకు వైష్ణవ్‌ తేజ్‌ను అంతా అభినందిస్తున్నారు.కాని సినిమా విషయంలో ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది తెలియదు.

ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్‌ ఉన్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రముఖ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

రెండవ సినిమాకే ఇంతటి సాహస నిర్ణయంను తీసుకున్న మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ను ఖచ్చితంగా అభినందించాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube