క్రికెట్ టీం కు సరిపడా మెగా హీరోలు ఎంట్రీ ఇవ్వడంతో ఒకరితో మరొకరు పోటీ తప్పేలా లేదు.ఈ క్రమంలో ఈసారి మెగా అన్నదమ్ముల మధ్య ఫైట్ జరిగేలా ఉంది.
మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్.అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఇద్దరు బాక్సాఫీస్ ఫైట్ లో దిగుతున్నాడు.
అదేంటి రెండో సినిమాకే అన్నతో ఫైట్ కు సిద్ధమవుతున్నాడా వైష్ణవ్ తేజ్ అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.సాయి ధరం తేజ్ దేవా కట్ట కాంబినేషన్ లో వస్తున్న రిపబ్లిక్ సినిమాతో వైష్ణవ్ తేజ్, క్రిష్ కాంబోలో వస్తున్న జంగిల్ బుక్ (వర్కింగ్ టైటిల్) పోటీ వస్తుందని టాక్.
ఆల్రెడీ రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు.గాంధి జయంతికి ఒకరోజు ముందు పొలిటికల్ వ్యవస్థ మీద సెటైరికల్ మూవీతో సాయి ధరం తేజ్ వస్తున్నాడు.
ఇక క్రిష్, వైష్ణవ్ తేజ్ మూవీ కూడా అదే వారం రాబోతుందని తెలుస్తుంది.సాయి తేజ్ అక్టోబర్ 1న వస్తే అక్టోబర్ 8న వైష్ణవ్ తేజ్ సినిమా వస్తుందని తెలుస్తుంది.
రెండవ సినిమాకే అన్నతో పోటీకి సై అంటున్నాడు వైష్ణవ్ తేజ్.వారం గ్యాప్ తో వస్తున్న ఈ అన్నదమ్ములు ఎవరు ఏ రేంజ్ లో సత్తా చాటుతారన్నది చూడాలి.