మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య డైరక్షన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ లో బి.
వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు.
సినిమాకు టైటిల్ గా రంగ రంగ వైభవంగా అని ఫిక్స్ చేశారు.ఇక ఫస్ట్ లుక్ టీజర్ తోనే సినిమా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుందని చూపించారు.
వైష్ణవ్ తేజ్, కేతిక శర్మల జోడీ బాగుంది.బటర్ ఫ్లై కిస్ ఇస్తానని చెప్పి హీరో హీరోయిన్ చేసే రొమాంటిక్ సీన్ తో టీజర్ వదిలారు.
మొదటి సినిమా ఉప్పెనతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కొండపొలం కమర్షియల్ గా సక్సెస్ చేయలేకపోయాడు అయినా సరే గిరీశయ్యతో చేస్తున్న రంగ రంగ వైభవంగా సినిమాతో మళ్లీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.గిరీశయ్య తమిళంలో అర్జున్ రెడ్డి సినిమాను డైరెక్ట్ చేశాడు.విక్రం తనయుడు ధృవ్ మొదటి సినిమా డైరెక్ట్ చేసిన గిరీశయ్య వైష్ణవ్ తేజ్ థర్డ్ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు.టైటిల్ టీజర్ తోనే సూపర్ ఇంప్రెస్ చేసిన వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో కెరియర్ లో మరింత క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.