ఉప్పెన సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఆ సినిమా తో సూపర్ హిట్ ను అందుకున్నాడు.రెండవ సినిమా కొండ పొలం నిరాశపరిచిన విషయం తెలిసిందే.
కాస్త గ్యాప్ తీసుకొని మూడవ సినిమా రంగా రంగా వైభవంగా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.సెప్టెంబర్ 2వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా కు గిరీషయ్య దర్శకత్వం వహించాడు.ఈయన అర్జున్ రెడ్డికి అసోసియేట్ డైరెక్టర్ అనే విషయం తెల్సిందే.
ప్రస్తుతం ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ సభ్యులు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.దాదాపు రెండు మూడు నెలల క్రితమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న కొన్ని పెద్ద సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సిద్ధం అయిన కారణం గా ఈ సినిమా ను వాయిదా వేస్తూ వచ్చారు.
ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.ఈ సినిమా కు సెన్సార్ బోర్డు యూ / ఏ సర్టిఫికెట్ ని ఇవ్వడం జరిగింది.సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమా బాగుంది అంటూ మంచి మార్కులు ఇచ్చారంటూ సమాచార మందుతోంది.ఈ సినిమా లో కేతిక శర్మ హీరోయిన్ గా నటించడం ద్వారా మంచి రొమాంటిక్ సన్నివేశాలు చాలానే ఉంటాయి అంటూ సినీ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు నమ్మకం తో ఉన్నారు.
వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాలోనే ముద్దు సన్నివేశాలు మరియు రొమాంటిక్ సన్నివేశాలు చేశాడు, కనుక ఆయన నుండి మళ్ళీ అలాంటి సన్నివేశాలను ప్రేక్షకులు కోరుకుంటున్నారు.అందుకే ఈ సినిమా లో అలాంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
అలాంటి సన్నివేశాలు ఉంటే మాత్రం ఫ్యామిలీ తో పాటు యూత్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.ఈ మూడవ సినిమా వైష్ణవ తేజ్ కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.