ప్రగ్యా జైస్వాల్.ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
`మిర్చిలాంటి కుర్రాడు` చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ అమ్మడుకు అందం ఉన్నా.అదృష్టం కలిసిరాలేదు.
క్రిష్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్కు జోడీగా `కంచె` వంటి భారీ బడ్జెట్ సినిమాలో నటించినా.ప్రగ్యాకు అవకాశాలు రాలేదు.
ఇక కంచె తర్వాత ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయజానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర వంటి చిత్రాల్లో నటించినా.ప్రగ్యాకు మంచి హిట్ పడలేదు.
ఇలాంటి తరుణంలో ప్రగ్యా జైస్వాల్కు డైరెక్టర్ క్రిష్ మరోసారి బంపర్ ఆఫర్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయితేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్తో క్రిష్ ఓ సినిమా చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇందులో రకుల్ రోజువారీ రైతు కూలీగా డీ-గ్లామర్ రోల్లో కనిపిస్తారని టాక్ నడుస్తోంది.ఇదిలా ఉంటే.ఈ సినిమాలో మరో కీలక పాత్ర కూడా ఉందట.
ఆ పాత్ర కోసం ప్రగ్యా జైస్వాల్ ని తీసుకోవాలని క్రిష్ భావిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
అదే జరిగితే ప్రగ్యా జైస్వాల్..
అదృష్టం పరీక్షించుకోవడానికి మరో మంచి అవకాశం వచ్చినట్టే అవుతుంది.కాగా, హైదరాబాదు సమీపంలోని వికారాబాద్ అడవుల్లో ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టాట్ అయినట్టు తెలుస్తోంది.