ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయమైన మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే రికార్డులు సృష్టించాడు.ఈ సినిమతో హీరోగా వైష్ణవ్ తేజ్, డైరక్టర్ గా బుచ్చి బాబుతో పాటుగా హీరోయిన్ గా కృతి శెట్టి తెరంగేట్రం చేశారు.
సినిమాతో కృతి శెట్టికి సూపర్ క్రేజ్ వచ్చింది.ఉప్పెన ద్వారా ఆమెకు నాలుగైదు సినిమా ఆఫర్లు వచ్చాయి.
ఇక వైష్ణవ్ తేజ్ కూడా సెకండ్ సినిమా క్రిష్ తో చేశాడు.కొండపొలం అంటూ కాన్సెప్ట్ మూవీతో వస్తున్నాడు వైష్ణవ్ తేజ్.
ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి తమిళ డైరక్టర్ గిరీశయ్య డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్.ఈ సినిమాలో కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలాఉంటే ఉప్పెన తర్వాత సెకండ్ సినిమా ప్రయత్నాల్లో ఉన్న డైరక్టర్ బుచ్చి బాబు అందరి హీరోల దగ్గరకు వెళ్లి మళ్లీ వైష్ణవ్ తేజ్ తోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట.ఈ క్రమంలో వైష్ణవ్ తేజ్ తో మరో సూపర్ కథని సిద్ధం చేశాడట.
అయితే వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం బుచ్చి బాబుకి డేట్స్ ఇచ్చే పొజిషన్ లో లేడని తెలుస్తుంది.వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలు బిజీగా ఉండటంతో బుచ్చి బాబుని వెయిటింగ్ లో పెట్టాడని టాక్.
హిట్ ఇచ్చిన డైరక్టర్ కు వెయిటింగ్ తప్పలేదని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.