మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ఉప్పెనఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది.దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పూర్తిగా సక్సెస్ కావడంతో ఈ సినిమాను ప్రేక్షకులు మళ్లీమళ్లీ చూశారు.
ఫలితంగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా ఓ డెబ్యూ హీరోకు అదిరిపోయే రేంజ్లో వసూళ్లను తెచ్చిపెట్టింది.
ఇక ఉప్పెన చిత్రం ఇచ్చిన సక్సెస్తో తన నెక్ట్స్ మూవీని కూడా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాడు ఈ హీరో.
స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తుండగా, అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.పూర్తిగా అడవి నేపథ్యంలో సాగే ఈ సినిమాపై అప్పుడే మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
దీంతో ఈ సినిమా హక్కుల కోసం తీవ్ర పోటీ నెలకొందని, ఇప్పటికే భారీ ఆఫర్లు కూడా వచ్చి పడుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాను క్రిష్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా హక్కుల విషయంలో తుది నిర్ణయం కూడా ఆయనే తీసుకోనున్నాడు.
మొత్తానికి ఉప్పెన చిత్రం అందించిన బూస్ట్తో తన నెక్ట్స్ చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్న వైష్ణవ్ తేజ్, తన నెండో చిత్రానికి వచ్చే ఆఫర్లను చూసి అవాక్కవుతున్నాడట.ఇక ఈ సినిమా షూటింగ్కు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిత్రం కోసం క్రిష్ విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఏదేమైనా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న రెండో చిత్రానికి కూడా అదిరిపోయే ఆఫర్లు వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.మరి ఈ సినిమాను క్రిష్ ఎలా రూపొందిస్తున్నాడో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.