ఉప్పెన సినిమాతో వంద కోట్ల వసూళ్లను దక్కించుకున్న వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన కొండ పొలం సినిమా వసూళ్ల విషయంలో నిరాశ పర్చింది.
సినిమా కేవలం రెండు నెలల గ్యాప్ లోనే తెరకెక్కించడం జరిగింది.కనుక బడ్జెట్ చాలా తక్కువ అయ్యి ఉంటుంది.
సినిమా బడ్జెట్ తో పోల్చితే ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు చాలా పెద్ద మొత్తమే అంటూ క్రిష్ సన్నిహితులతో అంటున్నాడట.ఒక మంచి కథను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఆ సినిమాను చేయడం జరిగింది.
మనిషి పట్టుదల మరియు తనపై తనకు నమ్మకంను బిల్డ్ చేసుకుంటే తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటాడు అనే నమ్మకంను ఈ సినిమా లో హీరో పాత్ర ద్వారా క్రిష్ చూపించాడు.ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను కొద్ది మంది మాత్రమే చేయగలరు.
క్రిష్ ఆ విషయంలో టాప్ అనిపించుకున్నాడు.
కొండ పొలం సినిమా థియేట్రికల్ రైట్స్.ఓటీటీ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ ఇలా అన్ని రైట్స్ ద్వారా బడ్జెట్ కంటే డబుల్ సంపాదించిందని అంటున్నారు.క్రిష్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే.
తన బ్యానర్ లో క్రిష్ ఇలాంటి వైవిధ్యభరిత సినిమాలు చాలా తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు.క్రిష్ తదుపరి సినిమా హరి హర వీరమల్లు అనే విషయం అందరికి తెల్సిందే.
కొండ పొలం కమర్షియల్ గా నిరాశ పర్చిందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో ఉంది.ఈ సమయంలో పవన్ తో చేయబోతున్న హరి హర వీరమల్లు సినిమా ఎలా ఉంటుంది అనేది అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎద్ద ఎత్తున అంచనాలున్న కొండ పొలం సినిమా ను జనాల్లో కొంది మంది మాత్రమే చూస్తున్నారు.క్రిష్ మూవీ అంటే ఒక ప్రత్యేకత ఉంటుందని భావించిన వారు మాత్రం కొండ పొలం చూస్తున్నారు.
ఇక కొండ పొలం కు హరి హర వీరమల్లు సినిమాకు ఖచ్చితంగా సంబంధం లేకుండా కమర్షియల్ గా పవన్ క్రేజ్ కు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.