ఉప్పెన సినిమాతో మొదటి ప్రాజెక్ట్ కే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్ తన సెకండ్ సినిమాను క్రిష్ డైరక్షన్ లో చేశాడని తెలిసిందే. కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.
సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ గా లేటెస్ట్ వీడియో అలరిస్తుంది.ఇక వైష్ణవ్ తేజ్ సెకండ్ సినిమా ఆగష్టు 20 ఉదయం 10:15 గంటలకు టైటిల్, ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని చిత్రయూనిట్ ఎనౌన్స్ చేశారు.ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాకు కొండపొలం, జంగిల్ బుక్ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.
అయితే ఈ రెండిటిలో క్రిష్ ఏది ఫైనల్ చేశాడన్నది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.సినిమాను కూడా అక్టోబర్ సెకండ్ వీక్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాతో పాటుగా వైష్ణవ్ తేజ్ గిరీశయ్య డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఆ సినిమాలో వైష్ణవ్ తేజ్ కెతిక శర్మతో జోడీ కడుతున్నాడు.
ఈ రెండు సినిమాలతో వైష్ణవ్ తేజ్ మరింత క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.క్రిష్ సినిమాలో వైష్ణవ్ తేజ్ డిఫరెంట్ గెటప్ తో మరోసారి మెగా ఫ్యాన్స్ ను అలరించడం పక్కా అని తెలుస్తుంది.