ఉప్పెన సినిమాతో మొదటి సినిమానే సూపర్ హిట్ అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్ తన సెకండ్ సినిమాను క్రిష్ డైరక్షన్ లో చేశాడు.సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
సినిమా టైటిల్ గా కూడా కొండపొలం అని ఫిక్స్ చేశారు.ఇక సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.
వైష్ణవ్ తేజ్ న్యూ లుక్ ప్రేక్షకులను అలరిస్తుంది.కొండ మీద పొలం పండించే వ్యక్తి జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.
సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మిస్తున్నారు.
క్రిష్ డైరక్షన్ లో సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉన్నట్టే.వెరైటీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మెగా హీరోకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో పాటుగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.అక్టోబర్ 8న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ఫిక్స్ చేశారు.ఈ సినిమాతో పాటుగా క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.