కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి.స్టార్ హీరోలకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువ సినిమాలలో నటించగా కొండపొలం సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ వైష్ణవ్ కు జోడీగా నటించారనే సంగతి తెలిసిందే.
కొండపొలం సినిమా యాక్షన్ సన్నివేశాలతో పాటు రొమాన్స్ సన్నివేశాలు కూడా ఉంటాయని వైష్ణవ్ తేజ్ కామెంట్లు చేశారు.
సినిమాలో రొమాన్స్ సీన్లు చేయడం తనకు ఇబ్బందిగా మారిందని వైష్ణవ్ తేజ్ తెలిపారు.
సినిమాలో గొర్రెల కాపరి పాత్రలో నటించడం సులువేనని అనిపించిందని డిక్షన్ నేర్చుకున్నానని వైష్ణవ్ తేజ్ పేర్కొన్నారు.కొండపొలం సినిమా కొరకు గొర్రెలు కాయడం కూడా తాను నేర్చుకున్నానని అయితే రకుల్ తో రొమాంటిక్ సీన్లలో నటించడం మాత్రం తనకు ఇబ్బందిగా అనిపించిందని వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చారు.
నిజానికి రకుల్ మాత్రమే కాదని ఇతర హీరోయిన్లతో సైతం రొమాంటిక్ సీన్లలో నటించడం ఇబ్బందేనని వైష్ణవ్ తేజ్ వెల్లడించారు.
రొమాంటిక్ సీన్స్ చేసే సమయంలో రకుల్ తన టెన్షన్ పోయేలా చేశారని రకుల్ ఆ సీన్లను చేసే సమయంలో సహకారం అందించారని వైష్ణవ్ తేజ్ పేర్కొన్నారు.ఉప్పెనలో రొమాంటిక్ సీన్లలో నటించడానికి టెన్షన్ పడలేదని వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చారు.ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు.
కొండపొలం సినిమాకు హిట్ టాక్ రావడంతో వరుసగా రెండో బ్లాక్ బస్టర్ వైష్ణవ్ తేజ్ ఖాతాలో చేరింది.వైష్ణవ్ తేజ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కమర్షియల్ గా కొండపొలం ఏ స్థాయిలో హిట్ అనిపించుకుంటుందో చూడాలి.తక్కువ రోజుల్లో పరిమిత బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.