మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో మొదటి సినిమానే సూపర్ హిట్ అందుకోగా సెకండ్ మూవీగా వచ్చిన కొండపొలం అంచనాలను అందుకోలేదు.క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వైష్ణవ్ తేజ్ ఖాతాలో ఫెయిల్యూర్ పడ్డది.
ఇక తన థర్డ్ సినిమా గిరీశయ్య డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.రంగ రంగ వైభవంగా టైటిల్ తో వస్తున్న ఈ సినిమా జూలై సెకండ్ వీక్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో రొమాంటిక్ బ్యూటీ కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా తర్వాత నూతన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి డైరక్షన్ లో వైష్ణవ్ తేజ్ సినిమా మొదలైంది.
టైటిల్ ఇంకా డిసైడ్ చేయని ఈ సినిమా బుధవారం మొదలవగా ప్రీ లుక్ పోస్టర్ లోనే రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు.వైష్ణవ్ తేజ్ నాలుగవ సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఆల్రెడీ సంక్రాంతికి రెండు భారీ సినిమాలు రిలీజ్ ఎనౌన్స్ చేశాయి.అందులో ఒకటి ప్రభాస్ ఆదిపురుష్ కాగా.
మరొకటి విజయ్ వారసుడు వస్తుంది.ఈ రెండు సినిమాలతో వైష్ణవ్ తేజ్ కి గట్టి పోటీ ఏర్పడుతుందని చెప్పొచ్చు.