మెగా బ్రదర్స్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.ఈయన రెండేళ్లుగా హీరోగా రాబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
చాలా లావుగా ఉండే వైష్ణవ్ సినిమాల కోసం బక్కగా అయ్యాడు.సినిమాల్లో నటించడం కోసం నటన మరియు డాన్స్లలో చాలా కాలం ట్రైనింగ్ అయిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా నిన్న లాంచనంగా ప్రారంభం అయ్యింది.
సినిమా ప్రారంభోత్సవం సందర్బంగా విడుదల చేసిన కొన్ని పోస్టర్స్ చర్చనీయాంశం అయ్యాయి.
ఆ పోస్టర్స్లో వైష్ణవ్ అచ్చు గుద్దినట్లుగా రంగస్థలం చిత్రంలోని చిట్టిబాబులా ఉన్నాడు.ఆ మాస్ బాడీ లాంగ్వేజ్, పల్లె వాతావరణం, లుంగీ ఇలా అన్ని కలిసి కూడా చిట్టిబాబు పాత్రను గుర్తుకు తెస్తున్నాయి.పైగా ఈ చిత్రంను నిర్మించేది రంగస్థలం చిత్రంకు దర్శకత్వం వహించిన సుకుమార్ అవ్వడంతో రంగస్థలంకు సీక్వెల్గా ఈ చిత్రం రూపొందుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చిట్టిబాబుగా అద్బుతమైన నటనతో ఆకట్టుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను మరిపించేలా వైష్ణవ్ తేజ్ లుక్ ఉంది.దాంతో తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుందేమో అనిపిస్తుంది.
రంగస్థలం సీక్వెల్ అంటూ మీడియాలో వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.ఈ చిత్రం పూర్తిగా కొత్త కథతో ఉంటుందని, రంగస్థలం చిత్రంతో అస్సలు సంబంధం ఉండదని పేర్కొన్నారు.కథలో భాగంగా వైష్ణవ్ తేజ్ లుక్ అలా డిజైన్ చేశాం తప్ప చిట్టిబాబు పాత్రకు ఈ పాత్రకు సంబంధం ఉండదని క్లారిటీ ఇచ్చారు.ఇదో విభిన్నమైన నేపథ్యంలో రూపొందుతుంది.
సుకుమర్ ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ చేశాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.అన్న సాయి ధరమ్ తేజ్ సక్సెస్ కోసం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు.
మరి తమ్ముడు అయినా సక్సెస్ను దక్కించుకునేనా చూడాలి.
.