టాలీవుడ్ ప్రస్తుతం కొత్త ప్రొడక్షన్ సంస్థలు భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నాయి.వీటిలో మైత్రీ మూవీ మేకర్స్ ముందు వరుసలో ఉంది.
ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి సుమారు పది సినిమాల వరకు లైన్ లో ఉండగా వాటిలో చాలా వరకు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీలే కావడం విశేషం.అలాగే మజిలీ సినిమాతో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.
ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ లోనే శివ నిర్వాణ మూడో సినిమా టక్ జగదీష్ తెరకెక్కింది.త్వరలో ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది.దీని మీద భారీగానే అంచనాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే ఈ ప్రొడక్షన్ నుంచి బాలకృష్ణతో కూడా ఒక మూవీ రానుంది.ఇదిలా ఉంటే ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ ఇప్పుడు వరుస సినిమాలని లైన్ లో పెట్టాడు.
అలాగే ప్రొడక్షన్ సంస్థలు అతనితో సినిమాకి అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి.
ఇప్పటికే ఉప్పెన నిర్మించిన మైత్రీలోనే మరో మూవీకి వైష్ణవ్ తేజ్ కమిట్ అయ్యాడు.అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.
అలాగే అర్జున్ రెడ్డి తమిళ్ ఫేమ్ గిరీశయ్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాని ఇప్పటికే స్టార్ట్ చేసేశాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో కూడా వైష్ణవ్ తేజ్ ఒక మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు.అయితే ఇది ఎవరి దర్శకత్వంలో ఉంటుంది అనేదానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
కాని ఈ సినిమాకి దర్శకుడు కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాడని, వైష్ణవ్ తేజ్ కి కథ కూడా చెప్పి ఒప్పించాడ తెలుస్తుంది.కొత్త దర్శకుడుతో ఈ మూవీ ఉంటుందనే టాక్ మాత్రమే బయటకి వచ్చింది.
అది ఎవరనేది మాత్రం ఇంకా అఫీషియల్ గా ప్రకటించ లేదు.