ఈమద్య కాలంలో థియేటర్ లో విడుదల అయిన సినిమాలు నెల లోపులోనే ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ అవుతున్నాయి.ఇటీవల విడుదల అయిన సినిమా లు ఓటీటీ రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి.
ఇదే సమయంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన కొండ పొలం స్ట్రీమింగ్ ఎప్పుడా అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.ఎట్టకేలకు ఈ సినిమా కు సంబంధించిన ఓటీటీ విడుదల విషయమై ఒక క్లారిటీని ఇవ్వడం జరిగింది.
ప్రముఖ ఓటీటీ అమెజాన్ వారు ఈ సినిమాను స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేయడం జరిగింది.సినిమా థియేటర్ లో విడుదల అయిన తర్వాత 50 రోజులకు గాను స్ట్రీమింగ్ చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు.
అయితే సినిమా నిరాశ పర్చింది.సినిమా వల్ల ఇప్పటికే అమెజాన్ కు నష్టం.
ఇలాంటి సమయంలో 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేస్తే ప్రయోజనం ఉండదు అంటూ అంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే అమెజాన్ వారికి నిర్మాతలు ముందస్తుగానే కొండపొలం స్ట్రీమింగ్ చేసుకునే అవకాశంను ఇవ్వడం జరిగిందని వార్తలు వస్తున్నాయి.
కొండ పొలం అక్టోబర్ 8వ తారీకున విడుదల అయిన విషయం తెల్సిందే.నాలుగు వారాల తర్వాత అంటే నవంబర్ 5న స్ట్రీమింగ్ చేయాలని భావించారు.కాని ఆ సమయంలో చాలా సినిమా లు స్ట్రీమింగ్ కు మరియు థియేటర్ రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి.
కనుక మూడు నాలుగు రోజుల ఆలస్యంగా నవంబర్ 8 లేదా 9 వ తారీకున అమెజాన్ లో స్ట్రీమింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు.అందుకు సంబంధించిన విషయాన్ని దీపావళి సందర్బంగా అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.మొత్తానికి కొండ పొలం స్ట్రీమింగ్ ను నవంబర్ మొదటి వారం లోనే ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
మరింత సమాచారం ఒకటి రెండు రోజుల్లో చిత్ర యూనిట్ సభ్యుల నుండి వచ్చే అవకాశం ఉంది.