మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా గత ఏడాది మార్చి లోనే విడుదల అవ్వాల్సి ఉంది.కాని కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది.
దాదాపు 11 నెలల ఆలస్యం తర్వాత ఉప్పెన ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఉప్పెన సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అనుకున్నట్లుగానే ఉప్పెన సినిమా ఘన విజయం సాధించింది.చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటీ అంటే వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి అయ్యింది.
క్రిష్ దర్శకత్వంలో కొండ పొలం అనే నవల ఆధారంగా వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సినిమా షూటింగ్ జరిపారు.షూటింగ్ ప్యాచ్ వర్క్ మినహా మొత్తం పూర్తి అయ్యింది.
కమర్షియల్ ఎలిమెంట్స్ కు పూర్తిగా దూరంగా ఉండే ఈ సినిమా ను క్రిష్ ఎప్పుడు విడుదల చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది కనుక సినిమాను రాబోయే రెండు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు.
కాని అనూహ్యంగా క్రిష్ ఈ సినిమా ను ఏకంగా ఆగస్టు వరకు వాయిదా వేస్తూ వస్తాడని తెలుస్తోంది.ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో క్రిష్ చెప్పాడట.
ఉప్పెన సినిమా సక్సెస్ అయ్యింది కదా వెంటనే ఈ సినిమాను విడుదల చేస్తే ఆ క్రేజ్ తో ఈ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంటుంది కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాని అసలు విషయం ఏంటీ అంటే ఉప్పెన సినిమాకు పూర్తి విరుద్దంగా వైవిధ్యభరితంగా ఈ సినిమా ఉంటుంది.
కనుక వెంటనే ఈ సినిమా విడుదల చేస్తే ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోవచ్చు అంటూ క్రిష్ కొండ పొలంను వాయిదా వేస్తూ వస్తున్నారు.