వైశాలి సినిమా చూసిన ఎవరైనా సరే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు.ఎందుకంటే ఆ సినిమాలో వైశాలి పాత్ర అంత బాధాకరమైనది.
ఆమె ఎంతోమంచి అమ్మాయి అయినా సరే భర్త అనుమానంతో చంపేయడం .దెయ్యంగా తిరిగి వచ్చి పగ తీర్చుకోవడం చేసి సినిమాను హిట్ చేసింది.సినిమా కంటే ఈ అమ్మాయి అందరికి బాగా నచ్చింది.ఆమె పేరు సింధు మీనన్.
అప్పటికే రియల్ స్టార్ శ్రీహరి భద్రాచలం సినిమాలో, కాజల్ చందమామ సినిమాలో చెల్లి పాత్రలో నటించి అల్లరి అల్లరి చేసి అందరిని మెప్పించింది ఈ భామ.మలయాళీ కుటుంబానికి చెందిన ఈమె చిన్నప్పటి నుంచే భరతనాట్యం నేర్చుకున్నారు.భరతనాట్యం కాంపిటీషన్ లో పాల్గొని అందులో విజేతగా నిలిచిన ఈమెకు అప్పుడే సినిమా అవకాశాలు వచ్చాయి.
1999లోనే ఈమె కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయినప్పటికి తెలుగులో ఆమెను గుర్తించడానికి చాలా సమయం పట్టింది.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈ భామ 2010లో పెళ్లి చేసుకొని నటనకు గుడ్ బై చెప్పారు.ఇప్పుడు ఆమెకు ఒక పాప, బాబు.
ఒక సాధారణ గృహిణిల ఎంతో ఆనందంగా సింధు మీనన్ జీవితాన్ని గడుపుతుంది.