ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే రీతిలో పరిపాలన అందిస్తున్న సంగతి తెలిసిందే.దాదాపు రెండు సంవత్సరాల పాలనలో మ్యానిఫెస్టోలో దాదాపు 90 శాతానికి పైగా వాగ్దానాలను నెరవేర్చడం జరిగింది.
కాగా మహామారి తీసుకొచ్చిన దారుణమైన పరిస్థితులకు ప్రజలకు ఉపాధి లేని సమయంలో కూడా హామీలను నెరవేరుస్తూ కీలక సమయంలో సీఎం జగన్ ఆదుకునే రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు.
దీనిలో భాగంగా ఇప్పటికే ఇటీవల జగనన్న తోడు ఇంకా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించగా తాజాగా నేడు వాహన మిత్ర మూడో విడత సొమ్ము రిలీజ్ చేయడానికి సీఎం జగన్ రెడీ అయ్యారు.
ఇప్పటికే రెండు సార్లు వాహనమిత్ర ఆర్థిక సాయం జగన్ ప్రభుత్వం అందించడం జరిగింది.ఈ పథకం ద్వారా ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు డైరెక్ట్ గా రూ.10వేల వారి అకౌంట్ లో పడనున్నాయి.దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 2.48 లక్షలమందికి ఈ పథకం ద్వారా మేలు జరగనుంది.
.