టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం ‘వరుడు కావలెను’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మహిళా డైరెక్టర్ లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది.
ఈ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేయాలనీ వరుస అప్డేట్ లు విడుదల చేస్తుంది.
తాజాగా చిత్ర యూనిట్ వడ్డాణం అనే సాంగ్ ను విడుదల చేసింది.
ఈ లిరికల్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.మరొక మంచి పాటతో మరొకసారి మన ముందుకు వచ్చింది చిత్ర యూనిట్.
వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు.వయ్యారం చిందేసే అందాల భోమ్మలు.
అంటూ సాగె ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటుంది.ఈ సాంగ్ కు థమన్ సంగీతం అందించగా.
మరొకసారి ప్రేక్షకులను అలరించే విధంగా కంపోజ్ చేసారు.
ఇక ఈ పాటలో మరొక విశేషం ఏంటంటే టాలీవుడ్ లోని ప్రముఖ సింగర్స్ అందరు కలిసి ఈ పాటను ఆలపించారు.
ఈ పాటలో హీరో నాగ శౌర్య తో పాటు హీరోయిన్ రీతూ వర్మ ఇంకా ప్రధాన మహిళ తారాగణం కనిపించారు.
రీతూ వర్మ, నాగ శౌర్య ఈ పాటలో మరింత అందంగా కనిపిస్తున్నారు.ఇక ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు.
ఇక ఈ సినిమా లవ్ అండ్ ఫన్ అండ్ ఎమోషన్స్ అన్ని కలగలిపి కుటుంబం మొత్తం ఒక దగ్గర కలిసి కూర్చుని చూసే విధంగా దర్శకురాలు తెరకెక్కించినట్టు తెలుస్తుంది.
మరి ఈసారి దసరాకు అంత పెద్ద పోటీ కూడా లేకపోవడంతో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే చిత్ర యూనిట్ నమ్ముతుంది.మరి చూడాలి మెగా శౌర్య ఈ సినిమాతో ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటాడో.