మహమ్మారి కరోనా వైరస్ ని అరికట్టాలంటే ప్రభుత్వ వ్యవస్థలు మళ్లీ గాడిలో పడాలంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ మాత్రమే ఏకైక మార్గం అని చాలామంది చెబుతున్నారు.ఇదే తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరపాలని ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
మొత్తం బాధ్యతను తామే వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం ఏడాదిలోపు దేశంలో 80 శాతం వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం చేస్తామని తెలపడం జరిగింది.
ఇటువంటి తరుణంలో భూపాల్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
విషయంలోకి వెళితే వ్యాక్సిన్ తీసుకోక ముందే అతను వ్యాక్సిన్ తీసుకొన్నట్లు సర్టిఫికెట్ కలిగిన మెసేజ్ అతని మొబైల్ కి వచ్చింది.మే 27 వ తారీఖు వ్యాక్సిన్ వేయించుకోవాలి స్లాట్ బుక్ చేసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్ళకముందే తాను వ్యాక్సిన్ వేయించుకున్న టు మొబైల్ కి మెసేజ్ వచ్చింది అని తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానల్స్ ఈ సదరు వ్యక్తి తెలియజేశారు.
ఈ విషయం సోషల్ మీడియాలో కూడా రావడంతో .ఇలా అయితే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరిగినట్టే అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.కేంద్రం ఇటువంటి విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని కూడా నెటిజన్లు కోరుతున్నారు.
.