మహమ్మారి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.జనవరి 16వ తారీకు ప్రధాని మోడీ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభం అయ్యింది.
ముందుగా ఫ్రంట్ లైన్ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రీతిగా పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది.
ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో వైద్యుడిగా మరియు ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సంజయ్ కుమార్ తాజాగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవటం తో తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తొలి ఎమ్మెల్యే గా రికార్డు సృష్టించారు.
జగిత్యాలలోని జిల్లా ప్రధాన తన ఆస్పత్రిలో సోమవారం ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకా పంపిణీని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే కూడా టీకా వేసుకున్నారు.మొదట కోవిడ్ వారియర్స్ ఉన్న వారికి టీకా వేసిన అనంతరం ప్రాధాన్య క్రమంలో అందరికీ టీకాలు వేస్తారని ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు.
.