ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలసిపోయారు.ఉద్యోగుల మాదిరిగా ముఖ్యమంత్రికి వారాంతపు సెలవు, క్యాజువల్ లీవులు, ఇతర సెలవులు ఉండవు కదా.
అందులోనూ గోదావరి పుష్కరాల సందర్భంగా విపరీతంగా పనిచేశారు.పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి రాజమండ్రిలోనే ఉన్నారు.
పుష్కరాల గురించి, అక్కడి ఏర్పాట్ల గురించి విపరీతమైన ప్రచారం చేశారు.రాష్ర్ట విభజన తరువాత మొదటి పుష్కరాలు కాబట్టి కనీవినీ ఎరుగని రీతిలో చేయాలనుకున్నారు.
తెలంగాణతో పోటీ పడాలని భావించారు.ఇదంతా చేసినా మొదటి రోజే తొక్కిసలాట జరిగి ఇరవైఏడు మంది చనిపోవడంతో బాబు షాక్ తిన్నారు.
అందుకు తానే కారకుడనే నింద కూడా పడింది.ఈ ఘటన తరువాత ఇక రాజమండ్రి నుంచి కదల్లేదు.
అర్థరాత్రి కూడావెళ్లి ఘాట్లను, బస్స్టేషన్లను, రైల్వే స్టేషన్లను తనిఖీ చేశారు.దీంతో మానసికంగా, శారీరకంగా అలసిపోయారు.
అందుకే కాస్త విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు.ఆ విశ్రాంతి సొంత రాష్ర్టంలో, దేశంలో దొరకదు.
దీంతో విదేశీ టూర్ ప్లాన్ చేశారు.కుటుంబంతో సహా ఆగస్టు రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు వెళుతున్నారు.
అమెరికా, జపాన్, సింగపూర్, మలేషియా మొదలైన దేశాలన్నీ చాలాసార్లు వెళ్లిన బాబు ఈసారి టర్కీ టూర్ ప్లాన్ చేశారు.ఆరు రోజులు అక్కడ హాయిగా గడుపుతారు.
ఈసారి టూర్లో విశేషమేమిటంటే ఆయన మనుమడు అంటే లోకేష్ కుమారుడు కూడా వెళుతున్నాడు.వాడికి ఇది మొదటి విదేశీ పర్యటన.
చిన్న వయసులో ఎంత అదృష్టం….!
.