కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చాలా కామన్గా ఉంటూనే ఉంటాయి.ముఖ్యంగా సీనియర్స్ మరియు జూనియర్స్కు మద్య ఎప్పుడూ కూడా వివాదం రాజుకుంటూనే ఉంటుంది.
ఆ కారణంగానే పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిందని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉంటారు.ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.
వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఒక వైపు ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరో వైపు మాత్రం కుమ్ములాటలు జరుగుతున్నాయి.తాజాగా రేవంత్ రెడ్డిపై వి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత కుమ్ములాటలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
తాజాగా వి హనుమంత రావు మాట్లాడుతూ.పార్టీలోని కొందరు పార్టీ అధినాయకత్వంపై విమర్శలు చేస్తున్నారు.సోనియా గాంధీ పనైపోయింది, రాహుల్ గాంధీ పట్టించుకోవడం లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు.పార్టీలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటీ.
పార్టీలోకి కొత్తగా వచ్చినవ్.పార్టీ విషయాలు నేర్చుకుని పార్టీకి పని చేయాలి.
అంతే తప్ప నేనే పోటు మగాడిని నేనే వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని అంటూ నీకు నీవు ప్రకటించుకోవడం ఎక్కడిది అంటూ హనుమంత రావు చాలా సీరియస్ అయ్యారు.నీవు కాస్త తగ్గి ఉండకుంటే నీ బండారం బయట పెడ్తా బిడ్డా అంటూ తీవ్ర పదజాలంతో ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డిపై విమర్శలు కురిపించాడు.