జగన్‌ చేసినప్పుడు కేసీఆర్‌ ఎందుకు చేయడు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీలు అన్ని కలిసి కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చాయి.రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లను కాంగ్రెస్‌ నాయకులు ముట్టడించేందుకు నేడు సిద్దం అయ్యారు.

 V H Hanumantha Rao Support In Telangana Rtc Strike-TeluguStop.com

ఈ సందర్బంగా నాంపల్లి కలెక్టరేట్‌ వద్ద కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వీ హనుమంత రావు దర్నాలో పాల్గొన్నాడు.పోలీసులు కలెక్టరేట్‌ వద్దకు వెళ్లేందుకు వీరికి అనుమతించలేదు.

దాంతో విహెచ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.

ఈ సందర్బంగా వీహెచ్‌ మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తులను దోచుకునేందుకు.

వాటిని అమ్ముకునేందుకు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను వాడుకోవాలని కేసీఆర్‌ చూస్తున్నాడు.ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు జీతాలు ఇవ్వకుంటే ఎలా బతుకుతాయంటూ ఆయన ప్రశ్నించాడు.

తాను మాత్రమే సంతోషంగా ఉంటే చాలు, ఇతరులు ఎటు పోతే ఏంటో అంటూ మీరు ఆలోచిస్తున్న విధానం ఏమాత్రం కరెక్ట్‌ కాదని ఈ సందర్బంగా వీహెచ్‌ అన్నాడు.వెంటనే ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేసేందుకు వారి కోరెక్కలను డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆయన కోరాడు.

పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్‌ ఆర్టీసీని విలీనం చేసినప్పుడు కేసీఆర్‌ ఎందుకు చేయడం లేదని, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటీ అంటూ ప్రశ్నించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube