చిరంజీవి సైరా చిత్రంపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యుల పోరాటం కొనసాగుతోంది.సినిమా ప్రారంభంకు ముందు కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామంటూ నిర్మాత రామ్ చరణ్ హామీ ఇచ్చాడట.
కాని ఇప్పుడు మొహం చాటేస్తున్నాడు అంటూ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగుతున్నారు.చాలా రోజులుగా వారి ఆందోళనలు అట్టుడుకుతున్నాయి.
చిరంజీవి ఇంటి ముందు, కొణిదెల ఆఫీస్ ముందు ఇంకా దర్శకుడి ఆఫీస్ ముందు ఇలా పలు చోట్ల ఉయ్యాలవాడ ఫ్యామిలీ ఆందోళనకు దిగింది.
తాజాగా ఏకంగా రాష్ట్ర హైకోర్టు ముందుకు వెళ్లింది.హైకోర్టులో సైరా చిత్ర నిర్మాతలు మరియు ఇతర యూనిట్ సభ్యులపై ఫిర్యాదు చేయడం జరిగింది.నిర్మాత రామ్ చరణ్ తమకు 50 కోట్ల రూపాయలను ఇస్తామంటూ అగ్రిమెంట్ రాసి ఇచ్చి మా నుండి సినిమాకు కావాల్సిన సమాచారం తీసుకుని ఇప్పుడు మమ్ములను పట్టించుకోవడం లేదు అంటూ ఉయ్యాలవాడ ఫ్యామిలీ మెంబర్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది.
సాయం చేయమని అడిగితే కనిపించక పోవడంపై ఉయ్యాలవాడ ఫ్యామిలీ ఆగ్రహంగా ఉంది.
ఈ వివాదం హై కోర్టుకు వెళ్లడంతో పరిస్థితి చేయి జారినట్లనిపిస్తుంది.నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడేందుకు ఎంత ప్రయత్నించినా కూడా 50 కోట్లు ఇవ్వాల్సిందే అంటూ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.భారీగా బడ్జెట్ పెరిగింది, సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదు.
ఆ కారణంగానే నిర్మాత అంత మొత్తం ఇవ్వలేడు అంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులను మద్యవర్తులు ఒప్పించే ప్రయత్నాలు విఫలం అవ్వడంతో వారు హైకోర్టుకు చేరుకున్నారు.అక్టోబర్ 2న విడుదల కావాల్సిన సైరా ఈ కారణంగా ఏమైన వాయిదా పడేనా చూడాలి.