మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సమయంలోనే ఉయ్యాలవాడ ఫ్యామిలీ మెంబర్స్ కొందరు తమకు చిత్ర నిర్మాత 50 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి తమ వద్ద కథ ఇతర విషయాలను తీసుకున్నారు.అందుకు గాను అగ్రిమెంట్ కూడా రాసి ఇచ్చారు.
ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు కోర్టుకు వెళ్లడం జరిగింది.
ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లడంతో సైరా చిత్రం విడుదల విషయమై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ సమయంలోనే మరికొందరు ఉయ్యాలవాడ వంశస్థులు చిరంజీవిని కలిసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను తెరకెక్కించినందుకు గాను కృతజ్ఞతలు తెలిజేశారు.తమ కుటుంబ పెద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం రావడం చాలా సంతోషంగా ఉందంటూ వారు ఆనందం వ్యక్తం చేస్తారు.
కర్నూలు జిల్లా నుండి వచ్చిన వారు చిరంజీవిని కలిసి మాట్లాడారు.
ఒక వైపు కొందరు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు సైరా చిత్రంను ఆపేసేందుకు కోర్టుకు వెళ్లి మరీ ఫైట్ చేస్తున్నారు.ఆర్ధికంగా సాయం చేయాల్సిందే అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.మరో వైపు కొందరు ఉయ్యాలవాడ ఫ్యామిలీ సభ్యులు మాత్రం సైరా విడుదల కోసం మద్దతుగా ఉన్నారు.
ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు వందల సంఖ్యలో ఉన్నారు.వారిలో కొందరు సైరాను వ్యతిరేకిస్తుంటే, కొందరు మద్దతు తెలుపుతున్నారు.
ఈ హడావుడి మద్య సైరా చిత్రం విడుదల సమయంలో ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.