ప్రభాస్తో వరుసగా చిత్రాలు చేస్తున్న యూవీ క్రియేషన్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు.సాహో చిత్రాన్ని మరియు ప్రస్తుతం రాధే శ్యామ్ చిత్రాన్ని చాలా ఆలస్యం చేసిందని చేస్తుందంటూ ఫ్యాన్స్ ఆగ్రహంను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
కొన్ని రోజుల క్రితం ప్రభాస్ మూవీ ఫస్ట్లుక్ విడుదల చేయడం లేదంటూ ట్విట్టర్లో ఏకంగా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ నెగటివ్ ట్రెండ్ చేసిన విషయం తెల్సిందే. యూవీ క్రియేషన్స్ చేసిన ప్రతి సినిమా కూడా చాలా చాలా ఆలస్యం అవుతూ వస్తుంది.
నిర్మాతలకు సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే వారి సినిమాలు ఆలస్యం అవుతున్నాయి అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి సమయంలో యూవీ క్రియేషన్స్ వారు ఓటీటీ పైకి వెళ్లడం పై కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
సినిమాలు చేసేందుకు సంవత్సరాలు తీసుకునే యూవీ క్రియేషన్స్ వారు వారాల్లో పూర్తి చేయాల్సిన వెబ్ సిరీస్లను నిర్మించడం విడ్డూరంగా ఉందంటున్నారు.
ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ ఒక యంగ్ దర్శకుడితో వెబ్ సిరీస్ను నిర్మించే పనిలో ఉంది.ఆ వెబ్ సిరీస్ను కేవలం నెల రోజుల వ్యవధిలో పూర్తి చేసి సోషల్ మీడియాలో తమపై ఉన్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని వంశీ ప్రమోద్లు భావిస్తున్నారు.మరో వైపు యూవీ వారు రూపొందిస్తున్న వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పాన్ ఇండియా క్రేజ్ ఉన్న యూవీ క్రియేషన్స్ ఖచ్చితంగా ఆ స్థాయి వెబ్ సిరీస్ను నిర్మించడం ఖాయంగా అంతా నమ్మకంగా ఉన్నారు.