యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ మీద కోపం వచ్చింది.అది ఎంతగా అంటే ఆ నిర్మాణ సంస్థని విమర్శిస్తూ ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ లో ట్రెండింగ్ లో ఉంచేంతగా అన్నమాట.
అసలు ఇంతకీ యువి క్రియేషన్స్ చేసిన తప్పేంటి అంటే తమ హీరో సినిమాకు సంబందించిన ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడమే.ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యాం.
ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది.
సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఏవి ఇవ్వకపోవడంతో నిద్ర లే యువి క్రియేషన్స్ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్.
అది కాస్త ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ట్రెండ్ చేసే సరికి అదే ట్విట్టర్ ట్రెండింగ్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది.తమ అభిమాన హీరో సినిమా గురించి టీజర్, ట్రైలర్ ఎక్స్ పెక్ట్ చేస్తున్న వారికి అవేవి ఇవ్వకపోవడంతో నిద్రలే యువి క్రియేషన్స్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
జూలై నెలలో రిలీజ్ ప్లాన్ చేసిన రాధే శ్యాం నుండి ఇప్పటివరకు ఓ టీజర్ వచ్చింది లేదు.అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ రాధే శ్యాం నిర్మాణ సంస్థ మీద నెగటివ్ ట్రోల్స్ చేస్తున్నారు.