ప్రభాస్ హీరోగా రూపొందిన రాధేశ్యామ్ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండి కూడా యూవీ క్రియేషన్స్ ట్రోల్స్ ఎదుర్కొంటూనే ఉంది.సినిమా షూటింగ్ ప్రారంభం అయిన ఏడాది వరకు కనీసం అప్డేట్ ఇవ్వక పోవడంతో అసలేం చేస్తున్నారు.
చేత కాకుంటే సినిమాలు తీయడం మానేయండి అంటూ ప్రభాస్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.అంతకు ముందు సాహో సినిమా విషయంలో కూడా అదే జరిగింది.
కాని రాధే శ్యామ్ సినిమా విషయంలో అది పీక్స్ కు చేరింది.మరీ దారుణమైన కామెంట్స్ ను చేస్తూ ఇష్టానుసారంగా ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.
ప్రభాస్ అభిమానులు రాధే శ్యామ్ అప్డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేయలా ఎదురు చూశారు.ఎట్టకేలకు సంక్రాంతికి సినిమా విడుదల అవ్వబోతుంది.
ఇక సినిమా విడుదల సమయంలో కూడా యూవీ క్రియేషన్స్ వారు విమర్శలు మూట కట్టుకోక తప్పడం లేదు.<,/br>
ఇటీవల విడుదల అయిన పాట విషయంలో యూవీ వారు ఎదుర్కొన్న ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పాట అప్ లోడ్ కు ఏకంగా అయిదు గంటలు ఆలస్యం అయ్యింది.దాంతో యూవీ క్రియేషన్స్ వారు నిద్ర పోతున్నారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
పాట విడుదల తర్వాత ఆ ట్రోల్స్ అన్ని కూడా మర్చి పోయారు.అయితే ఈసారి మాత్రం అభిమానుల ట్రోల్స్ ఏమీ లేకుండా యూవీ క్రియేషన్స్ వారు ప్లాన్ చేస్తున్నారు.
రెండవ పాట కోసం అభిమానులు ఎదురు చూడకుండానే విడుదల చేయాలని.అది కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనుకున్న తేదీకి మరియు సమయంకు విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
రెండవ సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ను రెండు రోజుల్లోనే ఇవ్వబోతున్నారు.ఆ పాటను డిసెంబర్ మొదటి వారంలోనే ఉంటుందని కూడా అంటున్నారు.
మొత్తానికి రాధే శ్యామ్ మేకర్స్ వారు ఇన్నాళ్లకు అయినా కళ్లు తెరిచారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.రాధే శ్యామ్ లో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే.
సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా భారీగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.