మనిషి చనిపోయిన సమయంలో డెత్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా తీసుకోవాలి.అలా డెత్ సర్టిఫికెట్ను తీసుకుంటేనే చనిపోయిన వ్యక్తి పేరుమీద ఉన్న ఇన్సురెన్స్ లేదా ఇతరత్ర పథకాలకు కుటుంబ సభ్యులు అర్హులు అవుతారు.
ఆ డెత్ సర్టిఫికెట్ను మున్సిపాల్లీ పరిధిలో అయితే మున్సిపల్ కమీషనర్ జారీ చేస్తారు.అదే గ్రామ పరిదిలో అయితే పంచాయితీ సెక్రటరీ జారీ చేస్తాడు.
డెత్ సర్టిఫికెట్ను మామూలుగా అయితే ప్రింటెడ్ ఇవ్వాలి.కాని ఉత్తర భారతదేశంలోని పలు గ్రామాల్లో ఇంకా కూడా కంప్యూటర్ అంటేనే తెలియదు.
తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా సిర్వారియా అనే గ్రామంలో లక్ష్మీ శంకర్ అనే వృద్దుడు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు.ఆయన మృతితో కుటుంబ సభ్యులకు ఇన్సురెన్స్ వచ్చేవి ఉన్నాయి.
దాంతో లక్ష్మీ శంకర్ తనయుడు తన తండ్రి డెత్ సర్టిఫికెట్ కోసం సిర్వారియా గ్రామ కార్యదర్శికి దరకాస్తు పెట్టుకున్నాడు.
దరకాస్తు పెట్టుకున్న ఆ కొడుకుకు సిర్వారియా కార్యదర్శి సర్టిఫికెట్ను జారీ చేయడం జరిగింది.అయితే ఆ సర్టిఫికెట్లో ఆ కార్యదర్శి ఎంత శ్రద్ద పెట్టి డ్యూటీ చేస్తున్నాడో అర్థం అయ్యింది.
డెత్ సర్టిఫికెట్లో లక్ష్మీ శంకర్ ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనే వివరాలను రాసిన కార్యదర్శి చివర్లో శంకర్ గారు మీరు భవిష్యత్తులో వెలిగి పోవాలి, మీకు అన్ని లాభాలు చేకూరాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటూ రాశాడు.చనిపోయిన వ్యక్తి ఇలా ఎలా ఉంటాడు.అసలు చనిపోయిన వ్యక్తికి భవిష్యత్తు ఎక్కడిది అంటున్నారు.
కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ డెత్ సర్టిఫికెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.