గంజాయికి రాజధానిగా ఉత్తరాంధ్ర మారింది..: లోకేశ్

వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర గంజాయికి రాజధానిగా మారిందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు.

 Uttarandhra Has Become The Capital Of Ganja..: Lokesh-TeluguStop.com

మూడు రాజధానులు అన్నారు.ఒక్కటైనా కట్టారా అని ప్రశ్నించారు.

విశాఖలో రైల్వేజోన్ కోసం కనీసం భూమి కూడా ఇవ్వలేదని చెప్పారు.టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతీ ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు.మహిళలకు ప్రతి నెల రూ.1500 ఇస్తామన్న లోకేశ్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు.కష్టకాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమకు అండగా నిలిచారని పేర్కొన్నారు.అయితే కొందరు కుట్రపూరితంగా టీడీపీ – జనసేన మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే ఫేక్ పోస్టుల పట్ల టీడీపీ – జనసేన నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube