మనషుల ప్రవర్తనకు విసిగి విసిగి కాలం కూడా కన్నెర్ర చేస్తుంది.ఎందుకంటే మనిషి పూర్తిగా స్వార్ధ జీవిగా మారిపోయాడు.
ఈ సమాజంలో దాదాపుగా మానవ సంబంధాలు అన్నీ ఆర్ధిక బంధాలుగా రూపాంతరం చెందాయి.చివరి తోడు ఎవరు ఉండరని తెలిసి కూడా స్వార్ధంతో బ్రతకడానికి అలవాటు పడిపోయాడు మనిషి అని చెప్పుకుంటున్న మాను. ఇకపోతే మానవత్వమా నీవెక్కడా అని ప్రశ్నించే రోజులు వచ్చాయి.ముసుగు వేసుకుని బ్రతుకుతున్న మనుషులు.కన్న వారు కాటికి ఎప్పుడు పోతారా అనే పిల్లలు.నేటి సమాజంలో కోకొల్లలు.
మరికొందరైతే బ్రతికి ఉండగానే తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్నారు.వృద్దాప్యంలో అందరూ ఉన్నా అనాధగా జీవించే వారు కొందరు.
ఇలాంటి పరిస్దితే ఒక వృద్దునికి ఎదురైంది.ఆ వివరాలు చూస్తే.
ఉత్తరాఖండ్ లోని రాంపూర్ కు చెందిన వృద్ధుడు రూప్ రామ్ కు నా అన్నవారు లేరు.భార్య చాలా కాలం క్రితమే మరణించగా, కడుపున పుట్టిన ఇద్దరు కూతుర్లు తండ్రిని వదిలేసి వెళ్లారట.
ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారో వారి ఆచూకి తెలియదట.ఈ క్రమంలో తాను మరణిస్తే అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రారని భావించిన ఆ పెద్దమనిషి స్థానికంగా ఉన్న పూజారిని సంప్రదించాడట.
అతడు ఇచ్చిన సూచనతో హిందూ సంప్రదాయం ప్రకారం తన అంత్యక్రియలు, కర్మకాండను తానే నిర్వహించుకున్నాడు.మంత్రోచ్ఛరణలు, బ్యాండ్ మేళం చప్పుళ్లతో ఘనంగా ఈ తంతు జరిపించుకున్నాడట.అనంతరం గ్రామస్తులకు రకరకాల వంటలతో భోజనాన్ని కూడా పెట్టాడట.ఇక అందరూ ఉండి అనాధగా మారిన ఈ వృద్ధుడి వ్యధ అందరి కంట నీరు పెట్టిస్తోంది.