దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది.ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు.
మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధులు, సెలెబ్రెటీస్ వరకు అంత ఈ మహమ్మరి పేరు వింటేనే భయపడిపోతున్నారు.
ఇప్పటికే పలు రాష్ట్రాల నాయకులకు, మంత్రులకు కరోనా వైరస్ సోకిన సంగతి అందరికి తెలిసిందే.తాజాగా ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.
గత కొన్నిరోజులు`గా కొంచెం సీఎం అనారోగ్యంతో బాధపడుతున్నాడు.కరోనా టెస్టులు చేయించుకోగా నిర్దారణ పరీక్షల్లో ఆయనకి కరోనా పాజిటివ్ అని తేలింది.దింతో ముందస్తు జాగ్రత్తగా సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.అయితే ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం బుధవారం జరగాల్సి ఉంది.
అయితే ముఖ్యమంత్రికి కరోనా వైరస్ సోకడంతో మంత్రివర్గ సమావేశం వాయిదా వేశారు.ఇక ఆగస్టు 25 నుంచి మూడు రోజుల పాటు సీఎం సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిన విషయం విధితమే.
అంతేకాకుండా ముఖ్యమంత్రి సలహాదారుల్లో ఒకరికి కరోనా వైరస్ సోకింది.దీంతో మరో మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.