ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా భయంకరంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.భారీగా కేసులు నమోదు అయ్యే పరిస్థితి మొన్నటి దాకా ఉండగా ఇటీవల కొద్దిగా కొద్దిగా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది.
ఇలాంటి తరుణంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురు తీవ్ర గాయాలపాలైరు.
కాన్పూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది.ప్రయాణికులు కలిగినా ఈ బస్సు వేగంగా ఓ లోడర్ను ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది.
మంచి స్పీడ్ మీద ఉండటంతో భారీగా బస్సు పల్టీలు కొట్టిన్నట్లు బస్సులో ప్రయాణికులు చెబుతున్నారు.దీంతో 16 మంది మరణించగా ఆరుగురికి తీవ్రగాయాలు కాగా ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉంది అన్నట్టు పోలీసులు చెప్పుకొచ్చారు.
ఈ సంఘటన తెలుసుకుని ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం బాదిత కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించగా, ఇదే రీతిలో యూపీ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది.