యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ తాజా చిత్రం ‘ఉత్తమ విలన్’.ఈ సినిమా అనేక అవాంతరాలు ఎదుర్కొని ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.విమర్శకులు కూడా ఈ సినిమాను యావరేజ్ చిత్రంగా తేల్చేశారు.
ఇక ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉందనే విమర్శలు వచ్చాయి.దాంతో ఈ సినిమాను రీ ఎడిట్ చేశారు.
తాజా రీ ఎడిట్లో 21 నిమిషాలు తగ్గించినట్లుగా చిత్ర యూనిట్ వర్గాల వారు ప్రకటించారు.
రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కమల్ హాసన్ మరియు లింగు స్వామిలు సంయుక్తంగా నిర్మించారు.
పూజా కుమార్ మరియు ఆండ్రియాలు ఈ సినిమాలో హీరోయిన్స్గా నటించారు.కమల్ హాసన్ ఈ సినిమాలో నట విశ్వరూపాన్ని చూపించాడు.
ఈ సినిమాలో దర్శక దిగ్గజాలు బాలచందర్, కె.విశ్వనాధ్లు నటించారు.ఈ సినిమాలో పలు లెంగ్తీ సీన్స్ను ట్రిమ్ చేయడం వల్ల ఇప్పుడు ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందన వస్తుందని భావిస్తున్నట్లుగా నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ముందే ఈ పని చేయాల్సి ఉంది.
నిండా మునిగిన తర్వాత ఏం చేసి ఏం లాభం, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన విడుదలై నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తే ఏం లాభం అని సినీ వర్గాల వారు అంటున్నారు.