కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో జరిగిన కాల్పుల విషయంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.17 సంవత్సరాల వయస్సు గల ఒక మైనర్ బాలుడు ఉత్తరప్రదేశ్ లో తుపాకీ కొనుగోలు చేసి మరీ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.అధికారుల దర్యాప్తులో 10,000 రూపాయలు చెల్లించి డీలర్ నుండి బాలుడు తుపాకీని కొనుగోలు చేసి జామియా మిలియా యూనివర్సిటీలో కాల్పులు జరిపాడు.
17 సంవత్సరాల వయస్సు ఉన్న మైనర్ బాలుడు కాల్పులకు తుపాకీని కొనుగోలు చేసి మరీ పాల్పడ్డాడని తెలిసి షాక్ అవ్వడం పోలీసుల వంతయింది.బాలుడు రెండు బుల్లెట్లను కొనుగోలు చేయగా ఒక బుల్లెట్ ఉపయోగించి మరో బుల్లెట్ ను తన దగ్గరే దాచుకున్నాడు.పోలీసులు బాలుడి దగ్గర నుండి బంగారు రంగులో ఉన్న తుపాకీతో పాటు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటికే బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలుడికు తుపాకీ అమ్మిన డీలర్, డీలర్ ను పరిచయం చేసిన బాలుడి స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.మైనర్ బాలుడు ఇంటి నుండి వెళ్లే సమయంలో గర్వపడే పని చేస్తానని చెప్పి వెళ్లినట్టు సమాచారం.
గర్వంగా నా గురించి చెప్పుకోవాలనుకుంటున్నావా…? ఈరోజు నుండి చెప్పుకుంటావు…? అని బాలుడు సోదరికి చెప్పిన తరువాత జామియా మిలియా యూనివర్సిటీలో కాల్పులు జరిపాడు.