మొన్నటి ఉప ఎన్నికల్లో టీపీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.శానంపూడి సైదిరెడ్డి విజయంకు తానే కారణం అంటూ ఒక స్వామీజీ చెప్పుకు తిరుగుతున్నాడు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక ఆడియో టేప్ వైరల్ అవుతుంది.పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్న ఆ ఆడియో టేప్లో ఏముందంటే.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన ఒక వ్యక్తి ఆ స్వామీజీ వద్దకు వెళ్లాడట.
ఆ వ్యక్తితో మాట్లాడుతూ గతంలో నేను సైదిరెడ్డికి ఒక తాయెత్తు ఇచ్చాను.
ఆ తాయెత్తు వల్లే ఆయన గెలిచాడు.అందుకే ఆ తాయెత్తును ఇంకా కూడా మెడలో ఉంచుకుంటున్నాడు.
నన్ను నమ్మిన వారు ఎప్పుడు మోస పోలేదు.నీవు కూడా నేను ఇచ్చిన తాయెత్తును కట్టుకో.
అప్పుడు ఖచ్చితంగా నీకు విజయం దక్కుతుంది.నీకు విజయం దక్కిన తర్వాతే నాకు ఏమైనా ఇవ్వు అంటూ బేరం పెట్టాడు.
మొత్తానికి ఆ ఆడియోలో ఉన్న స్వామీజీ ఎవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.అలాగే శానంపూడి సైదిరెడ్డిని ఈ విషయమై సంప్రదించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.