ఇటీవల వాట్సాప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వాట్సాప్ యూజర్లను నిరాశపరుస్తున్నాయి.తమ ప్రైవసీ పాలసీలకు ఆమోదం తెలిపిన వారికే వాట్సాప్ అందుబాటులో ఉంటుందని వాట్సాప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
యూజర్ డేటాను సేకరిస్తామని తమ మొబైల్ నంబర్లు ఇతర వివరాలను సేకరిస్తామని, అవి అంగీకరించిన వారికే వాట్సాప్ అందుబాటులో ఉంటుందని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది.ఈ నిర్ణయంపై వాట్సాప్ వినియోగదారులు పెదవి విరిచినప్పటికీ ప్రస్తుతం ఈ విషయంపై ప్రపంచ అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ స్పందించాడు.
వాట్సాప్ నిర్ణయం కరెక్ట్ కాదని వాట్సాప్ నిర్ణయంతో అంగీకరించని వారికి సరిగ్గా వాట్సాప్ తరహాలోనే ఉండే యూజ్- సిగ్నల్ యాప్ ఉపయోగించుకోవచ్చని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు.దీంతో ఒక్కసారిగా అందరూ యూజ్- సిగ్నల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఆసక్తి చూపడంతో యాప్ ఒక్కసారిగా సర్వర్ సేవలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది.అంతేకాక ఎలాన్ మస్క్ ట్వీట్ తో యూజ్- సిగ్నల్ యాప్ షేర్స్ ఒక్కసారిగా 1,100% పెరిగింది.అయితే ఇప్పటికీ వాట్సాప్ యూజర్లు ఏవైతే వాట్సాప్ విధించిన నిబంధనలను తొలగించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.