హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల వర్క్ పర్మిట్లకు ఫెడరల్ కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చిన గంటల వ్యవధిలోనే యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఇండియన్ ఐటీ కంపెనీలకు షాకిచ్చింది.భారతీయ ఐటీ కంపెనీలను హెచ్-1బీ వీసాలు పొందే సంస్థల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయంతో సదరు సంస్థలు హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం పోయింది.
యూఎస్సీఐఎస్ తాజా నివేదిక ప్రకారం అజిమెట్రీ ఇన్కార్పోరేషన్, నెటేజ్, బుల్మెన్ కన్సల్టెంట్ గ్రూప్ ఇన్కార్పోరేషన్, బిజినెస్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇన్కార్పోరేషన్, కెవిన్ ఛాంబర్స్, ఇ యాప్పైర్ ఐటీ ఎల్ఎల్సీ లాంటి కంపెనీలు ఉన్నాయి.కొత్తగా హెచ్-1బీ వీసా కోసం వచ్చిన దరఖాస్తులను అమెరికా ప్రభుత్వం తిరస్కరించినట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది.2015తో పోలిస్తే 2019లో తిరస్కరణకు గురైన హెచ్ఎస్సీఐఎస్ వీసాలు మూడు రెట్లు పెరిగాయి.వీటిలో 70 శాతం భారతీయులవే.
హెచ్-1బీ వీసా దరఖాస్తులను ఆమోదించే విషయంలో యూఎస్సీఐఎస్ తన ప్రమాణాలను మార్చుకోవడమే తాజా నిబంధనలకు కారణమని ఇమ్మిగ్రేషన్ నిపుణులు భావిస్తున్నారు.కొద్దిరోజుల క్రితం అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసే వారు ఆన్లైన్లో పది డాలర్ల నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాలని యూఎస్సీఐఎస్ కొత్తగా నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే.తాజాగా ఇప్పుడు భారతీయ ఐటీ కంపెనీలకు హెచ్-1బీ వీసా నిబంధనల్ని కఠినతరం చేయడంతో అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న ఐటీ నిపుణులు కలవరపాటుకు గురవుతున్నారు.