కుటుంబం అనగానే భార్యా, భర్త, పిల్లలు ఉంటారన్న సంగతి అందరికీ విదితమే.కుటుంబంలో ఏ ఒక్క సభ్యుడికి ఏం జరిగినా కుటుంబ యజమానిగా ఉన్న భర్త లేదా భార్య స్పందిస్తుంటారు.
తన భార్య, పిల్లలకు ఏం జరిగినా వెంటనే స్పందించి వారి బాగోగులు చూసుకుంటు ఉంటాడు.ఒకవేళ భార్యా, పిల్లలు కనిపించకపోతే ఏం చేస్తాడు? వెంటనే పోలీసులను ఆశ్రయించి వారిని కనిపెట్టాలని కోరుతాడు.ఓ భర్త అలానే చేశాడు.కానీ, విచారణలో పోలీసులకు అదిరిపోయే ట్విస్టు తెలిసింది.ఇంతకీ ఆ ట్విస్టు ఏమిటి? ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదంటూ ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కర్నాటకలోని మంగళూరు పోలీసులకు మంగళూరులోని అశోక్ నగర్లో ఉండే నాగరాజు కంప్లయింట్ చేశాడు.
తాను ఈ నెల 18న వ్యక్తిగత పని నిమిత్తం సొంతూరుకు వెళ్లి వచ్చే సరికి తన భార్య, పిల్లలు కనిపించకుండా పోయారని పోలీసులకు తెలిపాడు.అశోక్ నగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు పేర్కొన్నాడు.
చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినప్పటికీ తన భార్య రేణుక, ఇద్దరు పిల్లల ఆచూకీ తెలియరాలేదని చె్పాడు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మొత్తంగా నాగరాజు పేర్కొన్న వివరాలతో రేణుక, ఆమె పిల్లల ఆచూకీ తెలుసుకున్నాడు.ఇక్కడే పోలీసులకు అదిరిపోయే సంగతి తెలిసింది.
నిజానికి నాగరాజు రేణుక భర్త కాదన్న విషయం తెలుసుకుని పోలీసులు విస్తుపోయారు.
రేణుక భర్త కొద్ది కాలం కిందట చనిపోగా, నాగరాజుతో ఆమె అశోక్ నగర్లో సహజీవనం చేస్తోంది.ఈ క్రమంలో నాగరాజు ఇటీవల కాలంలో ఆమెను వేధిస్తున్నాడు.దాంతో నాగరాజు లేని సమయంలో తన ఇద్దరు పిల్లలతో ఆమె వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది.
నాగరాజుతో ఇక కలిసి జీవించలేననే తాను ఈ డెసిషన్ తీసుకున్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది.ఇకపోతే మ్యారేజ్ చేసుకోకుండానే రేణుకతో సహజీవనంలో ఉన్నట్లు నాగరాజు పోలీసులకు చెప్పాడు.
దీంతో పోలీసులు షాక్ అయ్యారు.ఇద్దరికి మ్యారేజ్ కానందున కాపురానికి రావాలని రేణుకను ఒత్తిడి చేయలేమని పోలీసులు తెలిపారు.
మొత్తంగా ఎంతో స్పీడ్గా కేసును చాలెంజ్గా తీసుకున్న పోలీసులకు విచారణలో ఊహించని ట్విస్టు ఎదురైంది.