కరోనా తీవ్రత తగ్గినా సరే మరో వేరియెంట్ రాకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కరోనా బలి తీసుకుంది.
అయితే శాస్త్రవేత్తలు ఇప్పటికి కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.మాస్క్ ధరించడంతో పాటుగా రెండు మీటర్ల దూరం పాటించాలని చెబుతున్నారు.
అయితే రెండు మీటర్ల సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా వ్యాక్ప్తిని నిలువరించడం కష్టమని అమెరికా ఒక అధ్యయనంలో వెల్లడించింది.యూఎస్ లో చేసిన పరిశోధనల ప్రకారం కరోనా పేషెంట్ ఉన్న ఇంట్లో అతని నుండి వైరస్ చాలా వేగంగా చుట్టుపక్కల వారిని చేరుతుందని అన్నారు.
కరోనా పేషెంట్ల శ్వాస, వారు మాట్లాడినా సరే వైరస్ క్రిములు నిమిషాల్లో ఇతరులను చేరుకుంటాయని చెబుతున్నారు.అంతేకాదు వెంటిలేషన్ సదుపాయాలు సరిగా లేకపోతే ఈ వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉందని అంటున్నారు.
గాలి ద్వారా కరోనా సోకే ప్రమాదం ఆఫీసుల్లో కన్నా ఇల్లలోనే ఎక్కువగా ఉంటుందని వారి పరిశోధనలో బయటపడ్డదని అంటున్నారు.దూరం పాటించడం మాత్రమే కరోనా నుండి రక్షణ కల్పించడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు.
మాస్క్ ధరిస్తూ సాధ్యమైనంత సామాజిక దూరం పాటించడమే కరోనా బారిన పడకుండా ఉండొచ్చని ఎప్పటిలానే అధ్యయనాలు చెబుతున్నాయి.