ప్రముఖ జర్నలిస్ట్ కోకీ రాబర్ట్స్ మృతిపట్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతాపం ప్రకటించారు.తనను ఏ రోజు ఆమె గౌరవించలేదని.
కానీ తాను మాత్రం ఆమె కుటుంబ కుటుంబసభ్యులు బాగుండాలని కోరుకునేవాడనని గుర్తు చేసుకున్నారు.ఇప్పటి వరకు రాబర్ట్స్ను తాను వ్యక్తిగతంగా కలవలేదన్నారు.
ఎంచుకున్న రంగంలో రాబర్ట్స్ ప్రోఫెషనల్గా ఎదిగారని.ప్రోఫెషన్స్ అంటే తనకు ఎంతో గౌరవమని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం రాబర్ట్స్ మృతికి సంతాపం తెలిపారు.ఆమె యువతకు ఒక రోల్ మోడల్ అని .పురుషాధిక్య రంగంలో వారిని అధిగమించి మరి అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారని ఒబామా గుర్తు చేసుకున్నారు.గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు.
ఏబీసీ న్యూస్ ఏజెన్సీలో 1960లో న్యూస్ కంట్రీబ్యూటర్గా తన జీవితాన్ని ప్రారంభించిన రాబర్ట్స్ అనతి కాలంలోనే మంచి జర్నలిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు.1974లో సీబీఎస్ న్యూస్, 1978లో ఎన్పీఆర్లో ఆమె చేరారు.ఆ సమయంలో ప్రతిష్టాత్మక పనామా కాలువ ఒప్పందాన్ని కవర్ చేశారు.న్యూయార్క్ టైమ్స్కు ఎన్నో వ్యాసాలు రాసిన రాబర్ట్.2015లో రాసిన ‘‘ ది సివిల్ వార్ అండ్ ది వుమెన్ ఆఫ్ వాషింగ్టన్, 1848-1868’’ వ్యాసానికి ప్రశంసలు లభించాయి.40 ఏళ్ల కెరీర్లో టీవీ, రేడియో, ప్రింట్ మీడియాలో కోకీ రాబర్ట్స్ సేవలందించచారు.